Friday, October 19, 2007

ఓం శ్రీ దుర్గాదేవతాయైనమః


నవరాత్రులలో ఎనిమిదవ రోజున అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. `దుఃఖేన గంతుం శక్యతే ఇతిదుర్గా` అని అన్నారు. అంటే, దుర్గతులను దూరం చేసేది దుర్గాదేవి.


అటువంటి శక్తి స్వరూపిణి దుర్గాదేవి అష్టమి తిథిరోజున రురుకుమారుడైన దుర్గముడైన రాక్షసుడిని సంహరించింది. దుర్గాదేవి ఆది ప్రకృతి. పంచమహా స్వరూపాల్లో మొదటిది. ఈ తల్లి శక్తి అనంతం. అందుకే వివిధ రకాల దుర్గాదేవి...


కరీనాతో ఆఫైర్స్ నిజమే: సైఫ్ ఆలీఖాన్


తనకు బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ మధ్య సంబంధం ఉన్న మాట నిజమేనని బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ స్పష్టం చేశారు. దీంతో వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. గురువారం రాత్రి ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌ ముగింపు కార్యక్రమంలో సైఫ్ దీనిపై నోరు విప్పారు.


ప్రస్తుతం మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా...


Tuesday, October 16, 2007

రంగులు మార్చే శివలింగం...


రామసేతువుకు తలెత్తిన ముప్పుతో శివలింగం రంగు మార్చుకుంటున్నదా? నమ్మండి నమ్మకపోండి, వారణాసిలోని శివలింగాలకు తోడుగా లక్నో నగరంలోని శివలింగాలు కూడా తమ రంగులను మార్చుకుంటున్నాయి. ఒకేరోజులో శివలింగాలు తమ రంగును మార్చుకున్న వైనం, కొన్ని సంవత్సరాల క్రితం తూర్పు భారతంలో విఘ్నేశ్వరుని విగ్రహాలు పాలు తాగిన ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది.

లక్నోలోని ఛారోధామ్ దేవాలయంలో శివలింగం రంగు మార్చుకున్న సంగతి తెలియగానే, దేవాలయానికి చేరుకున్న అనేక మంది భక్తులు శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటలకు నల్లరంగులోని శివలింగం తెల్లరంగులోకి మారడంతో ఈ సంఘటన బహుళ ప్రాచుర్యానికి నోచుకుంది. ఈ...


Monday, October 15, 2007

భక్తుల నీరాజనాలు అందుకుంటున్న 'అంభా భవానీ'


అంబాజీ- గుజరాత్‌లోని అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా బాసిల్లుతూ 'అంబా భవానీ'గా పిలవబడుతున్న దివ్య క్షేత్రం. అతి పురాతనమైన ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఎటువంటి దేవతామూర్తి కనిపించదు. దేవతామూర్తి పీఠం అక్కడ ఉంది. వస్త్రాలు మరియు ఆభరణాలు అలంకరించిన తీరు అక్కడ దేవతామూర్తి కొలువుదీరిన భ్రమకు లోను చేస్తుంది. 'జయ అంబే' అంటూ భక్తులు సాగించే నామ సంకీర్తనతో అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుని ఉంటుంది.


ఈ అమ్మవారి కరుణాకటాక్షవీక్షణలతోనే రుక్మిణి, శ్రీకృష్ణుని భర్తగా పొందింది. ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తలనీలాలు సమర్పించుకున్నాడని భక్తుల విశ్వాసం. అంబాజీ పట్టణంలో ప్రతి పౌర్ణమికి పెద్ద సంఖ్యలో చేరే భక్తులు 'లోక్ మేలా' పేరిట ఆధ్యాత్మిక ఉత్సవాన్ని జరుపుకోవడం ద్వారా అంబాజీ మాతను భక్తి ప్రపత్తులతో సేవించుకుంటారు. విశ్వవిఖ్యాతి చెందిన రాజులు, సాధుజన గాయకులు అమ్మవారి పాదాల చెంత...


మరో చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ముమైత్


'పోకిరి' చిత్రం ద్వారా ఐటంగర్ల్‌‌గా తెలుగు చిత్ర రంగం ప్రవేశం చేసిన ముమైత్ ఖాన్.. చిన్నగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయింది. 'పోకిరి' చిత్రంలో 'ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే' అనే పాటతో యువతను ఉర్రూతలూగించిన ముమైత్.. ఆ తర్వాత 'ఆపరేషన్ దుర్యోధన', 'ఎవడైతే నాకేంటి' చిత్రాల్లో నటించింది.


ఈ చిత్రాల్లో ఆమె నటనకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆమె హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. త్వరలో విడుదల కానున్న 'మైసమ్మ ఐపీఎస్' చిత్రంలో ముమైత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం విడుదల కాకమునుపే...