Tuesday, November 6, 2007

దీపావళి పండుగ ఎలా వచ్చింది


పిల్లలూ! దీపావళి పండుగ అంటే మీకు చాలా ఇష్టం కదూ! దీపావళి వచ్చిందంటే మీ కళ్ళలో వెలిగే సంతోషం ముందు కోటి మతాబుల వెలుగు కూడా దిగదుడుపే. స్కూల్ లేకపోయినా అమ్మ ఉదయాన్నే నిద్ర లేపడం కొంచెం కష్టమే అయినా అలమరలో దాచుకున్న టపాసులు గుర్తుకు రాగానే నిద్రమత్తు ఇట్టే వదిలిపోతుంది.


తల స్నానం చేసి, అమ్మ ఇచ్చిన కొత్త బట్టలు తొడుక్కుని, నాన్న కొని తెచ్చిన టపాసులను తీసుకుని మేడ మీదకు వెళ్ళి వాటిని కాలుస్తుంటే వచ్చే ఆనందమే వేరు. మరి మిమ్మల్ని ఇంత ఆనందపెడుతున్న దీపావళి ఎలా వచ్చిందనే సంగతి మీకు తెలుసా? ఆ సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాందీపావళి పండుగ రావడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయని మన పురాణాలు...


అష్టైశ్వర్యాలను తెచ్చే దివ్య దీపావళి


జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళినాడు తెల్లవారు ఝామునే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానాది కార్యక్రమాలు నిర్వహించాలి. మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటితో స్నానమాచరించాలి. ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో దీపములు పెట్టాలి.


ప్రధానంగా ఇంటి ద్వారం, ధాన్యపు కొట్టు, బావి, వంట ఇల్లు, రావి చెట్టు... ఐదు ప్రదేశాలలో తప్పకుండా దీపాలను వెలిగించాలి. దీపావళినాడు పగలు ఉపవాసం ఉన్న తర్వాత రాత్రి భోజనం చేయాలి. ఈ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి, పితృదేవతలకు దారి చూపించాలి. ఆ తర్వాత....