Tuesday, March 10, 2009

పార్టీకోసం రాజకీయాల్లోకి వచ్చా: బాలయ్య



కష్టాల్లో ఉన్న పార్టీని రక్షించేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ పేర్కొన్నారు. అయితే నేడు రాజకీయాల్లోకి వస్తున్న నటులంతా ఏదో ఒకటి ఆశించే వస్తున్నారంటూ ఆయన విమర్శించారు.


ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న బాలకృష్ణ నెల్లూరులో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో తన తండ్రి ఎన్టీఆర్ ప్రజలకోసమే రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. అయితే తదనంతరం జరిగిన...


మరిన్ని వివరాల కోసం...

హోళికా పూర్ణిమ... మీ సౌందర్య దేవత నడిచొస్తోంది



సంవత్సరంలో చిట్ట చివరన వచ్చే పూర్ణమ ఈ హోళికా పూర్ణిమ. లోకంలో ఎవరికైనా చిట్ట చివరి సంతానం అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఏడాదిలో చివరిగా వచ్చే ఈ హోళికా పూర్ణిమ కూడాను. అందుకే పెద్దలు ఈ హోళికా పూర్ణిమను ఓ ఉత్సవంలా జరుపుకోవాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా సుఖదుఃఖాల సమ్మిళతంగా సాగిపోయిన కాలానికి స్వస్తి చెపుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఆనంద సాగరంలో మునిగిపోతారు.


ఆ రోజన హోళీ జరుపుకున్న ప్రతి ఒక్కరు రంగులతో తడిసి నూతన సౌందర్యాన్ని తెచ్చుకుంటారు. నగలూ-నట్రా మంచి దుస్తులు వేసుకుంటేనే సౌందర్యంగా కనబడతారని చాలామంది అనుకుంటారు. కానీ మహాకవి పింగళి సూరన కళాపూర్ణోదయమనే కావ్యంలో అసలైన సౌందర్యం ఎక్కడుందో చెప్పాడు.


శాలీనుడనే పేరుగల నాయకుడుండేవాడు. అతనికి చక్కని శరీరము, సౌందర్యవతి అయిన సుగాత్రితో వివాహమైంది. వివాహమయ్యాక ఆమెను అతనితో పొందుకోసం మొదటిరాత్రి లోనికి పంపారు. ఆ రోజు రాత్రి ఏ మల్లెలూ వాడిపోలేదు. ఏ దుస్తులు నలగలేదు. అసలు ఆమెలో కించిత్ మార్పు సైతం కానరాలేదు. ఒకటి.. రెండు.. మూడు రాత్రులు ఇదే రీతిలో గడిచిపోయాయి. రాత్రి వేళ ఆమె గదిలోకి వెళ్లడం... ఉదయాన ఎలా వెళ్లిందో అలానే తిరిగి రావడం జరిగింది. దాంతో ఆమె మానసికంగా కుంగి పోయింది. తన సౌందర్యాన్ని చూసి భర్తలో...


ఇంకా చదవండి