Tuesday, October 14, 2008

రజనీ...రాజకీయాల్లోకి రా...



తెలుగు చలన చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై అభిమానుల ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఏకంగా తన అనుమతి లేకుండానే.. రాజకీయ పార్టీని ప్రారంభించి, జెండాను ఎగురవేశారు. దీంతో ఆగ్రహానికి గురైన రజనీ.. రాజకీయ రంగ ప్రవేశం చేయాలని తనను ఎవరూ నిర్భంధించ లేరని స్పష్టం చేశారు.


అంతేకాకుండా రాజకీయ గందరగోళానికి కారకులైన కోయంబత్తూరు జిల్లా అభిమానులకు రజనీకాంత్‌ సోమవారం లీగల్‌ నోటీసులు సైతం జారీ చేశారు. అఖిల భారత రజనీకాంత్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణకు నోటీస్‌ జారీ చేస్తూ, 15 రోజుల్లోగా సమాధానం...


హైదరాబాద్ బేగంపేటలో ఎయిర్ షో

నాలుగు రోజుల పాటు సాగే విమానయాన శాఖ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ విమాన ప్రదర్శన మరియు సదస్సు నేడు ప్రారంభం కానుంది. పౌరవిమానయాన శాఖతో కలిసి ఇండియా ఏవియేషన్-2008 సంయుక్తంగా నిర్వహించనున్న ఈ ప్రతిష్టాత్మ ప్రదర్శన మరియు సదస్సుకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200లకుపైగా విమానయాన సంస్థలకు చెందిన విమాన ప్రదర్శన... ఈ సదస్సులో ప్రదర్శనకు రానున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో బేగంపేట విమానాశ్రయం మరో సారి కళకళలాడనుంది. బోయింగ్ 777తో సహా వివిధ రకాల హెలి‌కాఫ్ట్‌ర్లు, విమానాలు ఒకరోజు ముందుగా ఇక్కడకు చేరి తమతమ స్టాల్‌లకు తుది మెరుగులు దిద్దుకున్నాయి.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి