Tuesday, August 28, 2007

ఆరోగ్యం కంటే.. వృత్తే నాకు ముఖ్యం: నయనతార


తెలుగు, తమిళ చిత్ర సీమల్లో బిజీగా ఉండే హీరోయిన్లలో నయనతార ఒకరు. ఇటీవల తమిళ యువహీరోతో ప్రేమలో పడి కాస్త వివాదాల్లో చిక్కుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మకు తమిళంలో అడపాదడపా నటిస్తూ.. తెలుగులో పూర్తిగా దృష్టిని కేంద్రీకరించారు. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న 'సెల్యూట్' చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది.


ఇంతలో నయనతారకు వైరల్ ఫీవర్ సోకడంతో అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ తన వల్ల చిత్రం షూటింగ్ ఆగిపోకూడని భావించిన నయన.. వైరల్ జ్వరంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీనికి చిత్రం యూనిట్ వర్గాలు ఆమెను అభినందించడమే కాకుండా.. విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట. అయితే అందుకు ససేమిరా అన్న నయనతార...


No comments: