Thursday, September 20, 2007

భారత్‌కు చేరుకున్న సునీతా విలియమ్స్


భారత సంతతికి చెందిన అమెరికా అంతరీక్ష వ్యోమగామి సునీతా విలియమ్స్ గురువారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది. అత్యధిక కాలం అంతరీక్షంలో గడిపిన మహిళగా ఈ సంవత్సరం సరికొత్త రికార్డును నెలకొల్పిన సునీత తన వారం రోజుల భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్ చేరుకున్నారు.


దశాబ్ద కాలం అనంతరం అహ్మదాబాద్‌లోని బంధువులను సునీత కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యాసంస్థలు నిర్వహించే పలు కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారు. చారిత్రాత్మకమైన సబర్మతీ ఆశ్రమంలో...


No comments: