Thursday, September 20, 2007

మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు


జగదాభిరాముడు కౌసల్య తనయుడు ఆజానుబాహువు, అరవింద దళాక్షుడైన ముగ్దమనోహర నీలవర్ణ శోభితుడు, అయోధ్య రాముని నామస్మరణయే శ్వాసగా భావించి భక్తులకు ఆదర్శనీయుడుగా నిలిచిన ఆంజనేయుని వాహనంగా చేసుకుని తిరుమలలోని మాడవీధులలో గురువారం ఉదయం రెండుగంటల పాటు శ్రీవారు సాగించిన సంచారం తిరుమలేశుని భక్తులకు అత్యంత రమణీయంగా నిలిచిపోయింది.


దేవాది దేవులు, మహర్షులు, యక్ష, కిన్నెర, కింపురుషులు వెంటరాగా ఆంజనేయుడు గంతులు వేస్తూ తీసుకు వెళుతున్నాడా... అన్న రీతిలో నీటి అలలపై తేలుతున్న పడవవోలె సాగుతున్న తిరుమలేశుని ఊరేగింపును వీక్షించేందుకు భక్తులు బారికేడ్ల ఆవల నిలుచుండి తదేక దీక్షతో...


No comments: